రాత్రి పదిగంటల వేళ....
బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ ఎయిట్ విద్యుద్దీపాల కాంతిలో రసికత్వానికి రాచమార్గంలా ఉంది. ఖరీదైన ఆ ప్రాంతంలో అన్నిటికన్నా అధునాతనంగా కనిపించే ఓ భవంతి కోటి కోర్కెల తొలిరేయిని తలపుకు తెచ్చే కోటలా అలంకరింపబడి ఉంది.
అయినా అక్కడ ఆహుతులు లేరు ఏదో ఫంక్షన్ జరుగుతోందని చెప్పడానికి. అలా అలికిడి లేకపోలేదు.
పోర్టికోకి అభిముఖంగా వున్న విశాలమయిన హాల్లో ఓ రౌండ్ టేబుల్ ఉంది. దాని చుట్టూ కుర్చీలు, వాటిపై వయస్సులో ఉన్న డజనుమంది అమ్మాయిలు కూర్చుని ఉన్నారు.
అందులో ఆంధ్రరాష్ట్రానికి చెందినవాళ్లే కాక ఇతర భాషల యువతులూ ఉన్నారు.
అందరూ అనుభవం గలవాళ్లే.
ఉద్యోగాల్లో కాదు. వ్యభిచారంలో-
సరిగ్గా పది రోజుల క్రితం దేశంలోని ప్రముఖ దినపత్రికలలో ఓ విచిత్రమయిన వార్త అనౌన్స్ చేయబడింది.....................